పోస్ట్లు
శృంగేరి
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
హిందువుల అద్వైత మఠం ఈ నదీతీరంలోనే ఆదిశంకరాచార్యులవారు అద్వైతసిద్ధిని పొందారు. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతం గా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, సహ్యాద్రిపర్వతశ్రేణులు పరవశింప చేసే ప్రకృతి సౌందర్యం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. శృంగేరి కి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. శంకరాచార్యులవారు ధర్మ ప్రచారంలో భాగంగా దేశాటన జరపుతూ శృంగేరి చేరుకున్న సమయంలో అక్కడ ఆయనకు కంటబడిన రెండు సంఘటనలు ఆశ్చర్యాన్ని కల్గించాయట. దాంతో ఆయన తొలి మఠాన్ని ఇక్కడే నిర్మించి పన్నెండేళ్ళ పాటు ఇక్కడే గడిపారని స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత దేశాటన జరుపుతూ పూరిలో బదరిలో కంచిలో మరియు ద్వారకాలో మఠాలను స్థాపించారు. ఇక్కడ సందర్శించవలసిన కొన్ని ప్రదేశాలు శారదాంబ దేవి ఆలయం,విద్యాశంకర దేవాలయం మరియు ఆది శంకర దేవాలయం, పార్స్వనాధ దేవాలయం. భక్తులకు వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.ఆలయంలో నిత్యం అన్నప్రసాదం జరుగుతుంది. మరిన్ని ప్రదేశాలు ఈ ప్రాంతం నుండి పర్యాటకులు సందర్శించవచ్చు. శృంగేరి నుండి ధర్మస
ముల్లయనగిరి , చిక్ మంగళూరు
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
అద్భుతమైన అతి పొడవైన శిఖరం ముల్లయనగిరి BABA BUDAN GIRI చిక్ మంగళూరు కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగళూరు జిల్లాలో ఈ పట్టణం ఉంది.ముల్లయనగిరి శిఖరం ఈ పట్టణానికి 16 K.M దూరంలో ఉన్న పశ్చిమ కనుమల్లో బాబా భూదాన్ గిరి కొండల్లో ఒక భాగం.ఇది సముద్ర మట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం నుండి అరేబియా సముద్రాన్ని చూడవచ్చు.ఈ పర్వతం నుండి చూస్తే మేఘాలు కిందకు వచ్చి పర్యాటకులను కను విందు చేస్తాయి. కొండపై నుంచి చూస్తే పాదాలను మబ్బును తాకుతునట్లుగా అనిపించింది. ఈ పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.చుట్టూ కాఫీ తోటలు జలపాతాలు ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. చిక్ మంగళూరు కాఫీ రాజధాని అని కూడా అంటారు.కుద్రేముఖ్ చుట్టూ ఉన్న దట్టమైన అడవులు జలపాతాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే మాణిక్యధార జలపాతం, కాళహస్తి జలపాతం ,కెమ్మనగుండి పర్వతం దగ్గర ఉన్న శాంతి జలపాతం, కదంబి జలపాతం ,హనుమాన్ గుండి జలపాతాలు ఇక్కడ చూడగలిగిన ప్రదేశాలు. బెంగుళూరు నుండి చిక్ మంగళూరు కు (240 k.m) బస్సు సౌకర్యం కలదు.యాత్రికులకు resorts,hotels మరియు
SAKREBYLE ELEPHANT CAMP , SHIMOGA
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
కర్ణాటకలోని ఏనుగుల సంరక్షణా కేంద్రం. షిమోగా-తీర్థహళ్లి రోడ్డులోని షిమోగా నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది రాష్ట్రంలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే ఉత్తమ శిబిరంగా పరిగణించబడుతుంది.ఈ క్యాంప్ తుంగ నది ఒడ్డునే ఉంటుంది.కర్ణాటకలో ఇది ఒక పర్యాటక ప్రదేశం.సందర్శకులు ఉదయాన్నే శిబిరానికి చేరుకోవాలి, ఏనుగులను తుంగా నది నీటిలో స్నానం చేయడం చూడవచ్చు.రోజు 25 ఏనుగులు దగ్గరలో ఉన్న అడవి నుండి ఇక్కడికి తీసుకువస్తారు.ఇక్కడే ఈ ఏనుగుల కు మావట్లు స్నానం చేపిస్తారు. ఈ ఏనుగుల కి సందర్శకులు కూడ స్నానం చేపించే అవకాశం కల్పిస్తారు. ఇక్కడి ప్రదేశం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.ఈ శిబిరాన్ని కర్ణాటక అటవీ శాఖ నిర్వహిస్తుంది.అనారోగ్యం, ప్రవర్తనా సమస్యలు, పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల ఏనుగులకు శిక్షణ లేదా శ్రద్ధ అవసరం కావచ్చు.అనియంత్రితమైన ఏనుగులను కూడా ఈ శిబిరంలో శిక్షణ కోసం తీసుకువస్తారు.సాధారణంగా అన్ని వయసుల ఏనుగులు శిబిరంలో ఉన్నాయి.ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన మావట్లు వీటికి శిక్షణ ఇస్తారు. Visiting Hours From 8.30 Am To 11.30Am In this jungle camp cottage facilities available for visitors, it